పాక్పై భారత సైనిక అధికారిణి సోఫియా ఖురేషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ న్యూస్తో పాక్ తప్పుడు కూతలు కూసిందని, ఎస్-400, బ్రహ్మోస్పై దాడి చేశామన్న పాకిస్థాన్ ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. సిర్సా, జమ్ము, భటిండా, భుజ్, నలియా, పఠాన్కోట్ వాయుసేన స్థావరాలు, చండీగఢ్ ఆయుధాగారంపై దాడి చేశామన్న ప్రకటనల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అంతేకాక, ప్రార్థనా మందిరాలపై భారత్ దాడి చేసిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు.