ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. భారత్లోని మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు పాక్ కుట్రలు చేస్తోందని విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధమని.. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్గా పాకిస్తాన్ కుట్రలు చేసిందని విక్రమ్ మిస్రీ తెలిపారు.