ఆపరేషన్ సిందూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరాలు వెల్లడించారు. 'గత రాత్రి దేశ సరిహద్దు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసింది. 300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించింది. LoC దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. జమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. జమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు. 34 చోట్ల పాక్దాడులకు పాల్పడితే తిప్పికొట్టాం' అని వివరించారు.