భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్లో జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్లను యూఏఈకి మార్చారు. మిగిలిన 8 మ్యాచ్లు అక్కడే నిర్వహించనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. భద్రతాపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారత్ దాడులతో పాక్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ బంకర్లోకి వెళ్లినట్లు సమాచారం.