పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. డీజీఎంవోల మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ గత కొన్ని గంటలుగా కాల్పులకు పాల్పడుతోందని, ఇందుకు పూర్తి బాధ్యత పాకిస్థాన్దేనని స్పష్టం చేశారు. పరిస్థితిని సరిగా అర్థం చేసుకుని దాడులను నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.