జమ్మూకశ్మీర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ కాగా, జమ్ము, శ్రీనగర్, కథువాలో పూర్తిగా బ్లాక్అవుట్ అమలైంది. శ్రీనగర్ పాతనగరంలో డ్రోన్ దూసుకువచ్చిన ఘటన కలకలం రేపింది. పంజాబ్లో అమృత్సర్, ఫిరోజ్పూర్, పఠాన్కోఠ్, ఫజిల్కా, హరియాణా, అంబాలా, పటియాలా, రాజస్థాన్లో జైసల్మేర్, బార్మర్ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అమల్లో ఉంది.