కాల్పుల విరమణ ఒప్పందం కుదిరనప్పటికీ పాకిస్థాన్ ఏ మాత్రం లెక్క చేయకుండా భారత్పై డ్రోన్లతో దాడి చేస్తుంది. తాజాగా, జమ్మూ & కాశ్మీర్లోని నాగ్రోటాలో పాకిస్థాన్ డ్రోన్లు భారత్ వైపు రావడంతో భారత వాయు రక్షణ వ్యవస్థ చురుకుగా స్పందించింది. బ్లాక్అవుట్ నేపథ్యంలో ఆకాశంలో ఎర్రటి జాడలు కనిపించగా, భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ డ్రోన్లను సమర్థంగా తిప్పికొట్టినట్లు సమాచారం.