పారిస్ ఒలింపిక్స్ 2024లో గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్లో పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ హర్షద్ నదీమ్ ఆల్టైమ్ ఒలింపిక్ రికార్డ్ను బద్దలు కొట్టాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో నార్వే జావెలిన్ త్రోయర్ ఆండ్రీస్ తొర్కిల్డ్సెన్ నమోదు చేసిన 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డ్ను హర్షద్ అధిగమించాడు.