పహల్గామ్ ఉగ్రదాడిలో తమకు సంబంధం లేదని, ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని పాక్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలే లేవని కబుర్లు చెబుతోంది. అబద్ధాలతో ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. కానీ పాకిస్థాన్ అసలు రంగు బయటపడింది. ఉగ్రవాదుల అంత్యక్రియలో పాక్ సైనికాధికారులు, జవాన్లు పాల్గొన్నారు. లష్కరే తోయిబా సభ్యుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ప్రార్థనలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.