కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పోటిఫై పాకిస్థానీ పాటలను తొలగించింది. దీంతో మాండ్, ఝోల్, ఫాస్లే వంటి పాపులర్ పాటలు ఇక స్పోటిఫైలో అందుబాటులో లేవు. ఆపరేషన్ సిందూర్, మే 8న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. 2021లో అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం, పాక్కి చెందిన డిజిటల్ కంటెంట్ను నిలిపేయాలని కేంద్రం ఆదేశించింది.