పేపర్‌ లీక్‌ ఘటన.. మరో పరీక్ష వాయిదా

83161చూసినవారు
పేపర్‌ లీక్‌ ఘటన.. మరో పరీక్ష వాయిదా
తెలంగాణ పేపర్‌లీక్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 4న నిర్వహించాల్సిన పరీక్షపై గురువారం టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ పరీక్షను నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై చర్చించనుంది. ఏప్రిల్‌ 4న రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకే కమిషన్‌ అధికారులు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

ట్యాగ్స్ :