సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది. జనవరిలో మహా కుంభమేళా ప్రారంభంకావడంతో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది రైళ్లలో తమ చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫుడ్ అమ్ముకోవడానికి రైలు ఎక్కుతాడు. అయితే రద్దీగా ఉండడం చూసిన కొందరు ప్రయాణికులు ఆహారం దొంగిలిస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది చాలా దారుణమని కామెంట్లు చేస్తున్నారు.