AP: పవన్ గెలవాలని వేగులమ్మ తల్లికి పొర్లుదండాలు పెట్టి, పెన్షన్ డబ్బులు రూ.27 వేలతో గరగ చేయించింది పిఠాపురానికి చెందిన పోతుల పేరంటాలు(96). తనకు పవన్తో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిపింది. విషయం తెలుసుకున్న పవన్ ఆమెను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. ఆవిడతో కలిసి భోజనం చేశారు. ఆమెతో కొద్దిసేపు ముచ్చటించిన పవన్.. చీరను, రూ.లక్ష నగదును అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.