ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఆదివారం తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళనున్నారు. అనంతరం సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి కోలుకున్న మార్క్ శంకర్తో ఇండియాకి చేరుకున్న పవన్ కళ్యాణ్ దంపతులు.. అగ్నిప్రమాదంలో తన కుమారుడు సురక్షితంగా ఉండటంతో తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకొన్నట్లు తెలుస్తోంది.