గంపల ప్రదక్షిణతో పెద్దగట్టు జాతర షురూ

55చూసినవారు
గంపల ప్రదక్షిణతో పెద్దగట్టు జాతర షురూ
లింగమంతులస్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభంకానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన దురాజ్‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఆదివారం రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్