మైనర్ బాలికపై అత్యాచారం చేసిన జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెందిన కొలిపాక అంజయ్యకు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5000 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా జడ్జి నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ ద్వారా నిందితునికి శిక్ష ఖరారు చేశారు. బాధిత బాలికకు రూ 3 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.