ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సూపరిండెంటెండ్, ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్పిటల్ లో శానిటేషన్, కలర్స్ ఈ నెల లాస్ట్ వరకు కంప్లీట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.