జగిత్యాల పట్టణంలోని 16వ వార్డులో 20 లక్షల నిధులతో, 1వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ లు కూతురు రాజేష్, కూసరి అనిల్, కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.