జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈవీఎం గోదాంను సందర్శించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి. ఎస్. లత, ఆర్డిఓ మధు సుధన్, ఎలక్షన్ సూపర్డెంట్ హకీం, ఎమ్మార్వో రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.