సుప్రీం కోర్టు ఎస్సిలలో ఏబిసిడి వర్గీకరణకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం పట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక లేఖ విడుదల చేశారు. 2004 ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎస్సి వర్గీకరణకు అనుగుణముగా నిర్ణయం కొరకు శాసనసభలో తీర్మానంతో అప్పటి యుపిఎ ప్రభుత్వానికి నివేదించి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి చట్టం చేయబడిందన్నారు