గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్21 మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, తక్షణమే రద్దు చేయాలని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ భూ బాధితులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్21 మైనర్ కాలువ ద్వారా ప్రయోజనం లేదని 32 మంది రైతులతో కూడిన సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. గ్రామ సభలో అధికారులు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.