కరీంనగర్ మండలంలో డెంగ్యూ కలకలం రేపుతుంది. దుర్శేడ్ గ్రామంలో ఇటీవల ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్ రాగా వారికి పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన బుధవారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో సర్వే చేపట్టి, మురికి కాలువలను శుభ్రం చేపించారు. ఇళ్లలో నిలిచిన నీటిని తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. డ్రై డేను పాటించాలని గ్రామస్థులను కోరారు.