కరీంనగర్: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం

62చూసినవారు
కరీంనగర్: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తంచేస్తూ బీజేపీ కరీంనగర్ సౌత్ జోన్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారు గాయత్రి దేవి మాట్లాడుతూ. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్