హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గురువారం నిర్వహించిన మత్స్యకారుల మహా ధర్నాలో కరీంనగర్ జిల్లా మత్స్య కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహజంగా మరణించిన మత్స్య కార్మికులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి రూ. 5, 000 పింఛన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిట్టల వెంకటేష్, ఉపాధ్యక్షుడు నూనె శేఖర్ తదితరులు పాల్గొన్నారు.