ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వి. నరేందర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.