జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పలు వార్డులో ఇళ్లులేని నిరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలను గుర్తించి మంజూరు చేస్తామన్నారు. వారి వెంట ఆర్డీవో శ్రీనివాస్, డిపిఓ రఘు వరుణ్ పాల్గొన్నారు.