కోరుట్ల పట్టణ కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్న జువ్వాడి రత్నాకర్ రావు స్మారక కోరుట్ల ప్రైమరీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ పోటీల్లో అల్ మదీనా జట్టు ప్రథమ స్థానం సాధించగా, రాయల్ కింగ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. మ్యా ఆఫ్ ది మ్యాచ్ రవికిరణ్, బెస్ట్ కిపర్ కళ్యాణ్, మోస్ట్ వ్యాలెబుల్ ప్లేయర్ మహేష్ లకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.