అధికారులు పట్టణ పరిశుభ్రత పాటించాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. గురువారం పట్టణంలోని 7వ వార్డు స్పెషల్ డ్రైవ్ కింద మురికి కాలువలు, నాలా పనులను పరిశలించారు. పట్టణ మున్సిపల్ అధికారులు పట్టణంలో అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, ఖాళీ స్థలంలో చెత్త చెదారం, శుభ్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పల్లెపు రేణుక మొగిలి, మున్సిపల్ అధికారులు, పాల్గొన్నారు.