మలేషియాలోని హైపోసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ హాల్ లో ఈ నెల 9వ తేదీ నుండి 12 వరకు నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మెట్టు హాసిని తన సత్తా చాటింది. జపాన్ షిటోరియు కరాటే అకాడమీ శిక్షకులు కావేటి సమ్మయ్య పర్యవేక్షణలో 19 ఏజ్, 66 కేజీలు కథ విభాగంలో బంగారు పతకం, కుమితే విభాగంలో వెండి పథకం సాధించింది. ఈ సందర్భంగా అకాడమీ పెద్దలు, పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.