పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రజలు ప్రజావాణి రద్దు విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ కోరారు.