పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా సీఎం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్లు రేవల్లి స్వామి, కానుకుర్తి కార్తీక్, కో ఆప్షన్ సభ్యులు చంద్రమౌళి, ఫహీం, నాయకులు ముబీన్, వెన్నం రవీందర్, కాశిపాక వాసు, పల్లె మధు పాల్గొన్నారు.