కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన రాకేష్, పులి నరేందర్ అనారోగ్యంతో ఉండగా వైద్య ఖర్చుల కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బాధితులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య, మాజీ ఎంపీటీసీ సదానందం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ రాముడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.