కాకతీయ కాలువ నుండి పెద్దాపూర్ చెరువును నింపడం ద్వారా హుస్సేన్ మియా వాగు పరివాహక ప్రాంత పొలాలకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. శనివారం జూలపల్లి మండలం పెద్దాపూర్ చెరువును పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లూరి వేణుగోపాల్ రావు, గండు సంజీవ్, బొజ్జ శ్రీనివాస్ పాల్గొన్నారు.