జూలపల్లి: మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తతో ప్రజల ఇక్కట్లు

58చూసినవారు
జూలపల్లి మండల కేంద్రంలోని ఒకటవ వార్డులో గల మురికి కాలువల్లో(డ్రైనేజీ) లో చెత్త భారీగా పేరుకుపోయింది. నిలిచిన మురికి నీటిలో దోమలు అధికమై దుర్గంధం వ్యాప్తి చెందుతుంది. దీనితో గ్రామస్తులు వ్యాధుల బారిన పడకుండా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ఒకటవ వార్డు నివాసి గంగిపల్లి విద్యాసాగర్, పలువురు యువకులు గురువారం ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్