పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శ్రీరాంపూర్ పాఠశాలలో ముందస్తు బడి బాటలో భాగంగా తల్లిదండ్రులు, టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం మాట్లాడుతూ మన పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర గూర్చి వివరించారు. కావున తల్లిదండ్రులు ఆలోచించి బడి ఈడు పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.