పెద్దపల్లి పట్టణంలో పందులను నియంత్రించాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పందుల పెంపక దారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో పందులను నియంత్రించాలని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే కొందరు ఇండ్ల మధ్యలో పందులను పెంచుతున్నారని, పట్టణానికి దూరంగా పెంచాలని సూచించారు.