పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను ఆవిష్కరించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్ పాల్గొన్నారు.