గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో రక్తదాన శిబిరం జరగగా ఈ శిబిరాన్ని జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ శుక్రవారం ప్రారంభించాడు. ఈ శిబిరంలో మొదటిసారిగా ఆర్ఎంఓ డాక్టర్ రాజు రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్ మర్దిలినా, తదితరులు ఉన్నారు.