గోదావరిఖని: భరోసా ఆధ్వర్యంలో గొడుగు అందజేత

56చూసినవారు
గోదావరిఖని: భరోసా ఆధ్వర్యంలో గొడుగు అందజేత
రోడ్డు మీద ఎండలో పండ్లు అమ్ముకుంటున్న నిరుపేద గృహినికి భరోసా ఆధ్వర్యంలో శనివారం గొడుగును అందజేశారు. గోదావరిఖని 5 ఇంక్లైన్ ఏరియాలో ఎలాంటి నీడలేకుండా చాలా రోజుల నుండి ఎండలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వసంత అనే మహిళ తీవ్ర ఇబ్బందికి లోనవుతుందని గ్రహించి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా గొడుగును అందించారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ అధ్యక్షుడు కుంట సదీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్