రామగుండం మండలం గోదావరిఖనిలోని శారద నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శుక్రవారం పరిశీలించారు. మున్సిప్ కోర్టు కాంప్లెక్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది న్యాయవాదులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.