రామగుండం నగరపాలక సంస్థ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు 100రోజుల కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అదనపు కలెక్టర్, స్థానిక కమిషనర్ (ఎఫ్ఎసి) జె అరుణ ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పారిశుద్ధ్యంపై ప్రవీణ్ ఇంజనీరింగ్ సిబ్బందితో చర్చించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని చెత్త సేకరణ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బందికి నగదు బహుమతి ఇవ్వాలని చెప్పారు.