సింగరేణి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మెగా జాబ్ మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కు చెందిన 100 కంపెనీలు 3 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులకు, నిరుద్యోగ యువతకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టారు.