చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి వారిని శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. గోవింద రాజుల స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.