రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం విడ్డూరమని డిసిసి సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడలో వీరంగం సృష్టిస్తున్న వీరంగం బిఆర్ఎస్ నాయకులు వాస్తవాల్ని పక్కదోవ పట్టించేందుకు కలిసికట్టుగా ప్రయత్నించడం సిగ్గుచేటని, రాష్ట్ర గవర్నర్ ను పాడి కౌశిక్ రెడ్డి అవమానించిన తీరు తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోలేదని మండిపడ్డారు.