ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై భారత మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ స్పందించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా త్వరగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారని అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అద్భుతమైన ఆటగాళ్లు తమకు 50 ఏళ్లు వచ్చేంత వరకు రిటైర్మెంట్ ప్రకటించకూడదని యోగ్రాజ్ అన్నారు.