TG: భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉండే ప్రజలు మనలాగే మంచి వాళ్ళని, రెండు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి మన మీద దాడులు చేయిస్తుందన్నారు. కానీ వారి వల్ల పాకిస్తానీయులు ఇబ్బంది పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారంటూ వ్యాఖ్యానించారు.