TG: కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ లో 6 జడ్పీటీసీలు ఉన్నాయని.. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామన్నారు. టికెట్ ఎవరికి వచ్చిన అందరూ కలిసికట్టుగా పని చేసి అఖండ మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.