భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్థాన్ను పెట్రోలియం కొరత వేధిస్తోంది. ఆ దేశ రాజధాని అయిన ఇస్లామాబాద్లోని అన్ని పెట్రోల్ బంకులను శనివారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, పాక్లోని 4 ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.