భారత్తో యుద్ధం చేస్తోన్న పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలిలింది. పాక్ దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో రాజధాని నగరమైన ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు పెట్రోల్ బంక్లు అన్నింటినీ మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. శనివారం నుంచి రాబోయే 48 గంటల పాటు ఫిల్లింగ్ స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు తక్షణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.