పుణెలో ఓ బాలుడు లగ్జరీ కారుతో బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు స్థానికంగా ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడంతో పోలీసులు అతడిని వీఐపీలా ట్రీట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్లో అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు ఈ కేసులో నిందితుడికి 15 గంటల్లోనే బెయిల్ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.